జమ్మికుంటలో గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో మోదీ జన్మదిన వేడుకలు

Written by

in

జమ్మికుంటలో గాండ్ల తిలకేశ్వర సంఘం ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పోతులూరి శ్రీశైలం ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గాండ్ల కులానికి చెందిన వ్యక్తి కావడం తమకు గర్వకారణమని, ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. గాండ్ల కులస్తులకు రాష్ట్రంలోని దేవాలయాల్లో ధూప దీప నూనె టెండర్లు కల్పించడంతో పాటు కుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వెన్నంపల్లి విట్టల్దాస్, సంఘం ప్రతినిధులు, కుల బాంధవులు పాల్గొన్నారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *