Swipe News

జమ్మికుంట వోకేషనల్ జూనియర్ కళాశాలలో ఘనంగా మహా అన్నదానం

జమ్మికుంట వోకేషనల్ జూనియర్ కళాశాలలో వినాయక నవరాత్రుల సందర్భంగా శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జమ్మికుంట రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు గర్రెపల్లి రాజమౌళి, సభ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సహకరించిన అసోసియేషన్‌కు కళాశాల సెక్రటరీ షేక్ అబ్దుల్లా, ప్రిన్సిపల్ అన్నబోయిన రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జమ్మికుంటలో ABVP ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

జమ్మికుంటలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ABVP ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల నుంచి సువర్ణ ఫంక్షన్ హాల్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సెమినార్‌లో మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తికి సామాన్య ప్రజల పోరాటం, సర్దార్ పటేల్ నాయకత్వాన్ని వివరించారు. నిజాంను కీర్తించడం అమరుల త్యాగాలను కించపరచడమేనని, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జమ్మికుంటలో గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో మోదీ జన్మదిన వేడుకలు

జమ్మికుంటలో గాండ్ల తిలకేశ్వర సంఘం ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పోతులూరి శ్రీశైలం ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గాండ్ల కులానికి చెందిన వ్యక్తి కావడం తమకు గర్వకారణమని, ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. గాండ్ల కులస్తులకు రాష్ట్రంలోని దేవాలయాల్లో ధూప దీప నూనె […]

జమ్మికుంటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

జమ్మికుంట: పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను దేశిని కోటి గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ప్రముఖులు, గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, వైస్ చైర్మన్ ఎర్రం […]

జమ్మికుంట వరుణ్ మోటార్స్ లో కొత్త కారు ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)

జమ్మికుంట (11 ఆగస్టు, 2026, జమ్మికుంట లోకల్ న్యూస్): పట్టణంలోని వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ (మారుతి సుజుకి షోరూమ్)లో నూతన బ్రెజ్జా కారును మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. జమ్మికుంట పట్టణానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు నిత్యం వివిధ అవసరాల కోసం పట్టణానికి వస్తుంటారని తెలిపారు. అలాంటి జమ్మికుంటలో జిల్లా స్థాయి పట్టణాలకు దీటుగా వివిధ షోరూమ్‌లు, వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం […]

నక్సల్స్ కు తలొగ్గని ధీరుడు రవీందర్ రావు – కొలకాని రాజు, బీజేపీ

జమ్మికుంట మండల మాజీ బీజేపీ అధ్యక్షుడు, స్వర్గీయ పోల్నెని రవీందర్ రావు గారి వర్ధంతి సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.రామమందిర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనను పార్టీకి రాజీనామా చేయాలంటూ 1997 జూన్ 15న నక్సలైట్లు దారుణంగా హత్య చేశారు.వారి ప్రాణ త్యాగాల పునాదులపైనే నేడు బీజేపీ అధికారంలో ఉందని కౌన్సిలర్ శీలం శ్రీనివాస్ తదితరులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్మన్‌కు ఇల్లందకుంట బ్రహ్మోత్సవాల ఆహ్వానం

మార్చి 24: ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్‌ను ఆలయ చైర్మన్ ఇంగ్లే రామారావు, ధర్మకర్తలు ఆహ్వానించారు. ఆయనకు ఆహ్వాన పత్రికతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు మున్సిపాలిటీ తరపున పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని, రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం అన్నివిధాలా సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌కు ఇల్లందకుంట శ్రీ సీతారామ కల్యాణ ఆహ్వానం

మార్చి 24: ఈ నెల 27న జరగనున్న ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందంను ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, ధర్మకర్తలు ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

జమ్మికుంటలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు

జమ్మికుంట: పట్టణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మొహమ్మద్ దౌలత్ పాషా ఆధ్వర్యంలో పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సజ్జాద్ మొహమ్మద్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అఖిలభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అతి చిన్న వయసులో బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో స్వాతంత్ర ఉద్యమాన్ని […]