Swipe News

జమ్మికుంట వోకేషనల్ జూనియర్ కళాశాలలో ఘనంగా మహా అన్నదానం

జమ్మికుంట వోకేషనల్ జూనియర్ కళాశాలలో వినాయక నవరాత్రుల సందర్భంగా శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జమ్మికుంట రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు గర్రెపల్లి రాజమౌళి, సభ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సహకరించిన అసోసియేషన్‌కు కళాశాల సెక్రటరీ షేక్ అబ్దుల్లా, ప్రిన్సిపల్ అన్నబోయిన రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గురుకుల పాఠశాలను సందర్శించిన అడిషనల్ జడ్జి

గండ్రపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను హుజూరాబాద్ అడిషనల్ జడ్జి వీణ పరిణతి, జమ్మికుంట ఎస్‌ఐ సంజీవ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రిన్సిపాల్ రేపాల ఇందిర, సర్పంచ్ తోట కవిత లక్ష్మణ్, ఉపసర్పంచ్ బీరేందర్ మాక్, ఉపాధ్యాయులు వారికి ఘన స్వాగతం పలికారు. జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమస్యలు ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎస్‌ఐ సంజీవ్ 112కు ఫోన్ చేయడం, […]

జమ్మికుంటలో ABVP ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

జమ్మికుంటలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ABVP ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల నుంచి సువర్ణ ఫంక్షన్ హాల్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సెమినార్‌లో మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తికి సామాన్య ప్రజల పోరాటం, సర్దార్ పటేల్ నాయకత్వాన్ని వివరించారు. నిజాంను కీర్తించడం అమరుల త్యాగాలను కించపరచడమేనని, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జమ్మికుంటలో గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో మోదీ జన్మదిన వేడుకలు

జమ్మికుంటలో గాండ్ల తిలకేశ్వర సంఘం ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పోతులూరి శ్రీశైలం ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గాండ్ల కులానికి చెందిన వ్యక్తి కావడం తమకు గర్వకారణమని, ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. గాండ్ల కులస్తులకు రాష్ట్రంలోని దేవాలయాల్లో ధూప దీప నూనె […]

24 గంటల్లో హత్య కేసు ఛేదించిన జమ్మికుంట పోలీసులు

జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని తనుగుల గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో బొజ్జపల్లి రాజబాబు హత్యకు గురైన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం కారణంగా రాజబాబుపై దాడి చేసి, అనంతరం మెడకు చున్నీ బిగించి హత్య చేసినట్లు వెల్లడైంది. మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టగా, పోలీసులు పార, గడ్డపార, సైకిల్, చున్నీలను స్వాధీనం చేసుకున్నారు.

జమ్మికుంటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

జమ్మికుంట: పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను దేశిని కోటి గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ప్రముఖులు, గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, వైస్ చైర్మన్ ఎర్రం […]

తెలంగాణలో 2026 SIR డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల

తెలంగాణ రాష్ట్రంలో Special Intensive Revision (SIR) – 2026 ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని ఓటర్లు తమ పేరు, ఓటరు వివరాలు ముసాయిదా జాబితాలో ఉన్నాయా లేదా అన్నది ఆన్‌లైన్‌లో సులభంగా పరిశీలించుకోవచ్చు. ఓటర్లు తమ పేరు, ఓటరు వివరాలు, పోలింగ్ కేంద్రానికి సంబంధించిన సమాచారం వంటి వివరాలను చెక్ చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఓటర్లు ఇలా చెక్ చేసుకోవచ్చు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోని […]

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డా. సుంకరి యాదయ్యకు ఘన సన్మానం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జమ్మికుంటకు చెందిన లెజెండరీ కరాటే ఛాంపియన్ డా. సుంకరి యాదయ్యను మున్సిపల్ అధికారులు ఘనంగా సన్మానించారు.

జమ్మికుంటలో నిత్య జనగణమనకు అరుదైన ఘనత

10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నిత్య జనగణమన కార్యక్రమం జమ్మికుంట, ఆగస్టు 14: దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తున్న జమ్మికుంట నిత్య జనగణమన కార్యక్రమం మరో మైలురాయిని చేరుకుంది. పట్టణ ప్రజల భాగస్వామ్యంతో ప్రతిరోజూ జాతీయ గీతాన్ని ఆలపించే ఈ ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15వ తేదీతో 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. గత తొమ్మిదేళ్లుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం జమ్మికుంటకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ప్రతిరోజూ నిర్ణీత సమయంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో జాతీయ గీతం […]

దొడ్డె ఆంజనేయులు ఐఏఎస్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం

జమ్మికుంట, ఆగస్టు 13: కరీంనగర్ జిల్లా జమ్మికుంట కు చెందిన ఐఏఎస్ దొడ్డె ఆంజనేయులు జన్మదిన సందర్భంగా వారి బందువులు జమ్మికుంట శివాలయం (బొమ్మలగుడి)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మికుంట ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దొడ్డ ఆంజనేయులు ఐఏఎస్ అక్క, బావ ఇల్లందుల శ్యామల–రమేష్ దంపతులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు, ప్రజలకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా పలువురు భక్తులు, ప్రజలు పాల్గొని […]